Vaisaakhi – Pakka Infotainment

వెస్ట్ బెంగాల్ పై క్లారిటీ ఇవ్వని ఎగ్జిట్ పోల్స్

అత్యంత ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కేరళం, పుదుచ్చేరి, అస్సాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలు మినీ సార్వత్రిక సమరాన్ని తలపింప జేసిందనే చెప్పాలి.
పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్ ముగియడంతో దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూసాయి.. మే నాలుగు న వచ్చే ఎన్నికల ఫలితాల కన్నా వివిధ జాతీయ మరియు ప్రాంతీయ సర్వే సంస్థలు విడుదల చేయబోయే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎంత గానో వెయిట్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అందరి దృష్టి
పశ్చిమ బెంగాల్ దీదీ హ్యాట్రిక్ కొడతారా? బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్న దానిపైనే ఉంది. కేరళం, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలపై పూర్తి క్లారిటీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ తమిళ నాడు లో ఓ మోస్తరు గా చెప్పగా అందరూ ఎదురు చూసిన వెస్ట్ బెంగాల్ పై మాత్రం క్లారిటీ ని మిస్ అయ్యాయి. గత దశాబ్ద కాలంగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు ప్రధాన ప్రతిపక్షంగా దూసుకొస్తున్న బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారిందని మమతా బెనర్జీ నాయకత్వంలోని TMCకే మొగ్గు చూపుతున్నాయి. లక్ష్మీర్ భండార్ వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను ఆకట్టుకున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అలాగే బీజేపీ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుందని ఉత్తర బెంగాల్ మరియు జంగిల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించవచ్చని అంచనాలు వేస్తున్నాయి.

తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ముద్రను కలిగి ఉంటాయి. ఈసారి స్టాలిన్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) క్లీన్ స్వీప్ చేసే దిశగా హవా కొనసాగుతుందనే ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ చెప్పగా బెంచ్ మార్క్(BENCH MARK) అన్న సంస్థ మాత్రం ఏఐఏడీఎమ్కె(AIDMK) బంపర్ మెజార్టీతో అధికారంలోకి రానుందని వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, స్టాలిన్ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. దాదాపు 135-160 సీట్లు DMK కూటమికి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పీపుల్స్ పల్స్,చాణక్య స్ట్రాటజీ, ప్రజా పోల్ అనలిటిక్స్, ఎస్ ఏ ఎస్ గ్రూప్, పల్స్ టు డే, భీకాన్ ఆర్గనైజేషన్, వంటి సంస్థలు డీఎమ్ కే (dmk) అధికారం లోకి వస్తాయని ఢంకా బజాయించి చెప్తున్నాయి, గతంతో పోలిస్తే సీట్లు తగ్గే సూచనలు ఉన్నాయి. అటు తమిళనాడులో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నా, సీట్ల పరంగా అది ఎంతవరకు మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.విజయ్ నేతృత్వంలోని TVK వంటి కొత్త పార్టీలు ఎవరి ఓట్లను చీల్చుతాయనేది ఇక్కడ కీలకం. ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల మూడ్‌ను ప్రతిబింబించినప్పటికీ, అవి ఎప్పుడూ వంద శాతం ఖచ్చితంగా ఉండవు. మౌన ఓటర్ల ప్రభావం మరియు క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న సమీకరణాలు ఫలితాలను మార్చే అవకాశం ఉంది. అసలైన ఫలితాలు వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగాల్సిందే.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More