మునుపెన్నడూ లేని విధంగా సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీ 3.0 కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ కార్యవర్గం తో పాటు ఆంద్రప్రదేశ్ కు అధిక ప్రాధాన్యత నిస్తూ దీనిని రూపకల్పన చేశారు. రాష్ట్రం లోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నూతన అధ్యక్షులను మరియు ప్రధాన కార్యదర్శులను ప్రకటిస్తూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
ఈ నియామకాల్లో . బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు సింహభాగం పదవులు కేటాయించడం ద్వారా పార్టీ తన ‘సామాజిక న్యాయ’ నినాదాన్ని గట్టిగా ప్రకటించుకుంది.
మొత్తం 25 పార్లమెంటరీ జిల్లాల్లో 14 జిల్లాల అధ్యక్ష పదవులను వెనుకబడిన తరగతులు (BC), ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలకే దక్కాయి. అలాగే మహిళా ప్రాతినిధ్యం పెంచుతూ గద్దె అనురాధ (విజయవాడ), పనబాక లక్ష్మి (తిరుపతి), గౌరు చరితా రెడ్డి (నంద్యాల) జ్యోత్స్న తిరునగరి (అంబరుపేట)వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.
అనుభవజ్ఞులతో పాటు నారా లోకేష్ మార్కు యువ నాయకత్వానికి ఈ జాబితాలో చోటు లభించింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం రాజకీయ అనుభవం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న వారికే ఈసారి ప్రాధాన్యతనిచ్చారు. రాబోయే ఎన్నికల లక్ష్యంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ కొత్త కమిటీల ప్రధాన కర్తవ్యం.
కొత్తగా నియమితులైన అధ్యక్షులందరూ తక్షణమే బాధ్యతలు స్వీకరించి, గ్రామ మరియు మండల స్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ప్రకటనతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తెలంగాణ ను ఎందుకు వదిలేశారు..?
సామాజిక’ విప్లవానికి తెర తీసామంటూ తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. జాతీయ కార్యవర్గాన్ని ప్రకటిస్తారని వార్తలు రావడం తో తెలంగాణా కు కూడా సారథులు ప్రకటిస్తారని టీజీ నేతలు ఆశించారు. అయితే ప్రకటించిన లిస్ట్ లో తెలంగాణ ప్రాతినిధ్యం కూడా మూడు పేర్లకే పరిమితం అయ్యింది. పాలిట్ బ్యూరో సభ్యుడిగా బక్కిన నరసింహులు(షాద్ నగర్),
అధికార ప్రతినిధులు గా నన్నూరి నర్శిరెడ్డి ( ఉప్పల్), తిరునగరి జ్యోత్స్న ( అంబరుపేట) లు తెలంగాణ నుంచి నియమితులయ్యారు జాతీయ ఉపాధ్యక్షులు గా మాధవ నాయుడు అండమాన్ కి ప్రాతినిధ్యం వహిస్తూ కమిటీ లో స్థానం పొందారు.