రాజీనామా చెయ్యడానికి చంద్రబాబు’నో’ అన్నారా..?

పశ్చిమా బెంగాల్ ఎన్నికలలో ఘోర పరాభవం చవిచూసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. నేను ఓడిపోలేదు రాజీనామా చేయను అసలు లోక్ భవన్ కు వెళ్ళే ప్రసక్తే లేదు. టీఎంసీ కి చెందిన వందసీట్లు బీజేపీ వాళ్ళు చోరీ చేశారు వారి కుట్రల వల్లే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి మోదీ, అమిత్‌ షా కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందంటూ దీదీ వాపోవడం తో రాజ్యాంగ నిపుణులు ఇప్పుడు తలలు పట్టుకున్నారు. దీంతో దీదీ రాజీనామా అంశం గవర్నర్ కు చేరింది. నిజానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 164 ప్రకారం ఎన్నికలు ఫలితాల అనంతరం గెలిచిన ఓడినా అప్పటివరకు అధికారం లో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. కొత్తప్రభుత్వం కొలువు తీరేదాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా వ్యవహరించాలి కొత్త ప్లభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే గత ప్రభుత్వం చట్ట బద్ధత కోల్పోతుంది. ఐదేళ్లు అనేది గరిష్ట పరిమితే కానీ చట్టబద్దత మాత్రం కానే కాదు. ఒక్కో సందర్భం లో నిర్ణీత కాలాని కంటే ముందు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి వుంటుంది. ఇది రెగ్యులర్ గా జరిగే తంతు.

ఇప్పుడు మమతా బెనర్జీ వివాదాస్పద ప్రకటన పై దేశం అంతా విస్తుపోయినప్పటికి దాదాపు ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో కూడా చోటు చేసుకుందన్న విషయాన్ని రాజకీయ పండితులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. 2019 లో తెలుగుదేశం పార్టీ ఓటమి తరువాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటమి పాలయయ్యాక రాజీనామా చేయడానికి నిరాకరించారు. మే 23 న వచ్చిన ఫలితాలలో 175 సీట్లకు గాను 151 సీట్లు వైసీపీ కి రాగా,TDP 23 సీట్లకు మాత్రమే పరిమితం అయి అధికారాన్ని కోల్పోయింది. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014 జూన్ 8 న తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఐదేళ్ళ ఏళ్ల పదవీ కాలం జూన్ ఏడు కు ముగియనుండాల్సి ఉండగా నిర్ణీతకాలాని కంటే ముందే ఎన్నికలు జరగడం ఫలితాలు రావడం తో చంద్రబాబు పదవీకాలం ముగియలేదంటూ ఆ పార్టీనేతలు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దానికి తోడు చంద్రబాబు కూడ వెంటనే రాజీనామా చేయకపోవడం తో కొన్నిరోజుల పాటు ఈ అంశం ప్రచారం లో ఉంది. ఎన్నికలలో గెలిచిన వైసీపీ వాళ్ళు దీనికి విపరీతంగా ప్రచారం కల్పించారు. అయితే అప్పటి వ్యవహారానికి ఇప్పటి దీదీ వ్యవహరించే తీరు కి సంబంధం ఏమాత్రం లేనప్పటికీ దానిని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ పార్టీ దారుణ ఓటమి చవిచూసిన ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేసేదిలేదని మమత భీష్మించుకున్నారు. ఆ రాష్ట్రంలో లో రేపో మాపో బిజెపి ప్రభుత్వం కొలువు తీరే అవకాశం వున్నందున దీదీ రాజీనామా చేయకపోతే ఆరాష్ట్ర గవర్నర్ ఆమె ను బర్తరఫ్ చేసే అవకాశం ఉంది.

Related posts

అసలు ఎవరీ అర్లేకర్..?

అధికార, ప్రతిపక్షాలతో కమ్యూనిస్టుల దోస్తానా..?

సౌత్ లో కమల వికాసం కష్టమా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More