రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇప్పుడు తమిళనాడు లోనే కాదు దేశమంతటా వినిపిస్తున్న పేరు. తమిళనాడు ఎన్నికలలో అతిపెద్ద పార్టీ గావిజయం సాధించి అధికార పీఠాన్ని అధిరోహించాలని తహతహ లాడుతున్న టీవీకే పార్టీ కి చుక్కలు చూపిస్తున్న గవర్నర్ అధికారాలపై సర్వత్రా ఇప్పుడు చర్చించు కుంటున్నారు. కొత్త గవర్నమెంటు ఏర్పాటు చేయించాల్సిన గవర్నర్… ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ట్రపతి పాలన విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడుకు ఎందుకీ పరిస్థితి ఎదురైంది? కొత్త ముఖ్యమంత్రి చేత ప్రమాణస్వీకారం ఎందుకు చేయించలేదనే విషయం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా.. అవ్వడా..? అన్న టెన్షన్ మధ్య ఊగిసలాడుతున్న తమిళనాడు రాజకీయం ఇన్ని మలుపులకు కారకుడు ఆయన. తమిళనాడు అసెంబ్లీలో ఎన్నో సందర్భాల్లో గవర్నర్ ను అవమానించిన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఆ పదవికి ఉన్న పవరేంటి? ఇంతకీ గవర్నర్ విధులేంటి? బాధ్యతలు ఏంటి? ఈ గవర్నర్ ఎక్కడి నుంచి వచ్చారు.? ఇదే చర్చ అన్ని మాధ్యమల్లో నిజానికి తమిళనాడు గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పూర్తిస్థాయి గవర్నర్ కాదు. ఈయన కేరళ గవర్నర్ గా ఉంటూ తమిళనాడుకు ఇంఛార్జిగా గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఈ అర్లేకర్ ఎవరూ అన్న ఉత్సుకత అందరిలో మొదలయ్యింది. గోవాలోని పనాజీలో 1954 ఏప్రిల్ 23న జన్మించారు. అమ్మ తిలోత్తమ, నాన్న శిశ్వనాథ్. వాస్కో డా గామా సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి వాస్కో డా గామా ఎంఈఎస్ కళాశాలలో కామర్స్లో డిగ్రీని ఎం.కామ్ (M.Com) పూర్తి చేసిన విద్యావంతుడైన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉన్న
ఆర్లేకర్ రాజకీయాల్లోకి రాకముందు మరియు తన ప్రారంభ జీవితంలో గోవాలోని వాస్కోడగామాలో వ్యాపారవేత్త గా వుండే ఆయన చిన్నతనం నుండే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో చురుకైన కార్యకర్తగా ఉండేవారు. ఈ సంస్థ ద్వారానే ఆయన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
1975–1977 మధ్య ఎమర్జెన్సీ కాలంలో రాజేంద్ర, ఆయన తండ్రితో పాటు జైలు శిక్షను అనుభవించారు. 1989 నుండి భారతీయ జనతా పార్టీ లో క్రియాశీల సభ్యునిగా ఉన్న రాజేంద్ర గోవా బీజేపీకి నాలుగేళ్లు రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు.
2002 అసెంబ్లీ ఎన్నికల్లో గోవా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012 లో గోవా శాసనసభ స్థానం నుంచి ఎన్నికైన తర్వాత గోవా అసెంబ్లీకి స్పీకర్గా వ్యవహరించి దేశంలోనే కాగిత రహిత వ్యవస్థను అవలంబించిన మొదటి శాసనసభగా తీర్చిదిద్దారు. రాజేంద్ర దార్శనిక నాయకత్వం తో దేశవ్యాప్త ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా గోవా అటవీ, పర్యావరణ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా కూడ వ్యవహరించిన అక్లేకర్ కు చిన్న వయసులోనే గవర్నర్ పదవి అలకంరించే అవకాశం లభించింది. 2021 లో హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నర్గా నియమితులయి 2023 వరకు కొనసాగారు. అనంతరం ఆయన బీహార్ 30వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు, 2025 లో కేరళ గవర్నర్గా నియమితులై ఈ ఏడాది మార్చి నుంచి తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఫలితాలు వెలువడకముంది హంగ్ ఏర్పడుతుంది… టీవీకే విజయ్ కింగ్ మేకరవుతారని అంతా భావించారు. కానీ కింగ్ కాడానికి అడుగు దూరంలో ఆగిపోయారు. దీంతో రాజకీయ పరిణామాల్లో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది. ఎవరు అధికారం చేపడతారో తెలియని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ తో ఎమ్మెల్యేల జాబితా లోక్ భవన్ కు సమర్పిస్తే గానీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయబోమనే సమాధానం గవర్నర్ కార్యాలయం స్పష్టత ఇవ్వడం తో పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమిళనాడు ప్రజలు అధికార మార్పును కోరుకుని విలక్షణ తీర్పు ఇస్తే… గవర్నర్ రూపంలో అధికారాన్ని చేపట్టలేని పరిస్థితి కన్పిస్తోందని కొందరు రాజకీయ నాయకులు, విజయ్ అభిమానులు ఆవేదనకు లోనయ్యారు. గవర్నర్ తీరును తప్పుబడుగున్నారు. లోక్ భవన్ ముట్టడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ కు సంక్షోభ రాజకీయాలేం కొత్తకాదు రాజకీయాల పట్ల పరిపూర్ణమైన అవగాహన రాజ్యాంగం పట్ల పరిజ్ఞానం తో పాటు పార్టీల వ్యవహారశైలి ని తెలిసిన వ్యక్తి గా రాజేంద్ర విశ్వనాథన్ కరెక్ట్ గా వ్యవహరిస్తున్నారని కొంతమంది కితాబునిస్తుంటే మరికొంత మంది గవర్నర్ రాజకీయ వేత్త గా ఒక పార్టీ కి అనుగుణంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. అసలు తమిళనాడు లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందా..? లేక రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందా..? మళ్ళీ ఎన్నికలకు టీఎన్ సిద్దపడుతుందా..? ఎన్నో ప్రశ్నలకు అవకాశం ఇచ్చిన ఆర్లేకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వేచి చూడాల్సిందే..!