టీటీడీ కోటా విడుదల..

మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా వాటిని బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. అలాగే జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌ ద్వారా ఈ టికెట్లను భక్తులకు కేటాయిస్తారు. ఈ టికెట్లు పొందిన వారు ఆర్జిత సేవా టికెట్ల మొత్తాన్ని చెల్లించి స్లాట్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు అదేవిధంగా, కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను అదే రోజున అంటే ఈ నెల 20వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్‌ లైన్‌ కోటాను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. తిరుమలలో మే నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను ఈ 26వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణువాసం వంటి వసతి గదులకు సంబంధించిన మే నెల గదుల కోటాను ఈ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు

Related posts

మోదీ మెచ్చిన మన కాఫీ

చాయ్ కహానీ తెలుసుకో భాయ్..

క్యాన్సర్ వాక్సిన్ ని తీసుకొచ్చిన రష్యా

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More