కౌంటింగ్ ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్.

గతం లో ఎప్పుడూ లేని విధంగా 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఏజెంట్లు మద్యం సేవించినట్లు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి నిరాకరించాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లుచేస్తోంది ఈసీ. రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.* కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు ఏపీకి వచ్చాయి. కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు.కౌంటింగ్ కేంద్రాల దగ్గర గుమికూడకూడదు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప..ఎక్కడెక్కడ అయితే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో.. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయ్యింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది.

Related posts

మోదీ మెచ్చిన మన కాఫీ

చాయ్ కహానీ తెలుసుకో భాయ్..

క్రెడిట్ కొట్లాట

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More