ఇటీవల కాలంలో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత జరిగిన అనేక సంఘటన లపై ఎన్నో వివాదాంశాలు బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్ విభజన గానీ, విభజిత దేశానికి కోట్లాది రూపాయల పరిష్కారం ఇప్పించడం లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (MK GANDHI) ప్రమేయం చాలా ఎక్కువని ఇప్పుడు వినిపిస్తున్న మాట.. అందుకే గాంధీని భారతపిత అనడం కన్నా పాకిస్తాన్(PAKISTAN) పిత అనడం చాలా కరెక్ట్ అని కొంతమంది భావన. అలాగే గాంధీ అనుసరించిన ముస్లీమ్ అనుకూల విధానాల వల్లే ఆయన అనుచరులు చాలా మంది గాంధీ తో విభేదించారని చెపుతుంటారు. తనకు అత్యంత ఇష్టమైన గీతం అని పలుమార్లు చెప్పుకున్న ‘రఘుపతి రాఘవ రాజారామ్.. పతిత పావన సీతారాం..సుందర్ విగ్రహ మేఘశ్యామ్.. గంగ తులసి సాలగ్రామ్..’ గీతాన్ని చేసి ఈశ్వర్ అల్లా తేరోనామ్ సబ్కో సన్మతి దే భగవాన్..’ అన్న తన అనుకూల విధానాలతో కలుషితం చెయ్యడమే కాకుండా మహాత్మా గాంధీ నిర్వహించిన తన ప్రార్థనా సమావేశాలలో భాగంగా హిందూ దేవాలయాలలో, హిందూ నివాస ప్రాంతాలలో ఖురాన్ పఠించేవారన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే దీనిపై కొన్ని వివాదాలు, నిరసనలు కూడా వ్యక్తమయ్యాయని చెపుతున్నారు.
AI IMAGE
దేశ విభజన సమయంలో ఢిల్లీ (DELHI)లోని వాల్మీకి మందిరం లో 1947 ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో జరిగే సాయంత్రం ప్రార్థనలలో ఖురాన్ వచనాలను తాను చడవడమే కాకుండా వచ్చే భక్తులతో చదివించేవారట. అలాగే బిర్లా మందిరం, బిర్లా హౌస్(BIRLA HOUSE) (ప్రస్తుత గాంధీ స్మృతి) ప్రాంగణంలో జరిగే ప్రార్థనా సమావేశాలలో కూడా ఆయన ఖురాన్ పఠనాన్ని చేర్చేవారు. దేవాలయ ప్రాంగణంలో ఖురాన్ చదవడంపై అప్పట్లో కొంతమంది హిందూ అతివాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు “ఖురాన్ చదవద్దు” అని గట్టిగా అరుస్తూ ప్రార్థనలకు అడ్డు తగిలేవారట. అందుకు ప్రతిగా “ఈశ్వర్ అల్లా తేరో నామ్” సిద్ధాంతాన్ని నమ్మిన ఆయన అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, దేవాలయంలో ఖురాన్ చదవడం వల్ల హిందూ మతానికి ఎలాంటి ముప్పు లేదని చెప్తూ అభ్యంతరం చెప్పిన వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించేవారు.
దేశంలో మతపరమైన అల్లర్లు జరుగుతుండటంతో, ప్రజల మధ్య మత సామరస్యాన్ని (Communal Harmony) పెంపొందించడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారని గాంధేయవాదులు గాంధీ చర్యలను సమర్ధించేవారు.