అత్యధిక శాతం ఓట్లు వచ్చిన ఎమ్మెల్యే లు ఎవరో తెలుసా..?నోటాకు అత్యధిక ఓట్లు ఎక్కడా…?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు (64.21%)లకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రాన్ని ఆ సంస్థ విడుదల చేసింది. అలాగే స్వల్ప ఓట్ల తేడాతో శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు (0.19%), ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి (0.47%) అత్యల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకు 45.60%, వైఎస్సార్సీపీకు 39.37%, జనసేనకు 6.87%, బీజేపీకు 2.83%, కాంగ్రెస్‌కు 1.72%, నోటాకు 1.09%, బీఎస్పీకి 0.60%, సీపీఎంకు 0.13%, సీపీఐకి 0.04%, ఇతర పార్టీలకు 1.75% ఓట్లు పోలయ్యాయి. 175 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మహిళలు ఉన్నారు. మహిళా విజేతలందరికీ 40%కిపైగా ఓట్లు లభించాయి. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో సాలూరు (3.63%), రంపచోడవరం (3.45%) ఉన్నాయి.

Related posts

అసలు ఎవరీ అర్లేకర్..?

అధికార, ప్రతిపక్షాలతో కమ్యూనిస్టుల దోస్తానా..?

రాజీనామా చెయ్యడానికి చంద్రబాబు’నో’ అన్నారా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More