జమిలి ఎన్నికల వైపుగా కేంద్రం ఆలోచన చేస్తుందా..?

జమిలి ఎన్నికలకు మోదీ ప్రభుత్వం దాదాపుగా పచ్చజెండా ఊపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావిస్తూ పార్లమెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించినట్లు కూడా వెల్లడించింది. దీనిపై ఎన్డీఏ కూటమితో చర్చించామని జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసిందని..వాటిని లాకమిషన్‌ పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. త్వరలో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్‌ నుంచి క్లారిటీ రానుంది. వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని..2014 నుంచి ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని పార్లమెంట్‌లో వివరించింది. ఎన్నికల నిర్వహణ ఆర్థిక భారంతో కూడుకుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని..దీని వల్ల ప్రజా ధనం ఆదా అవుతుందని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తోందని తెలిపింది 2016లో ప్రధాని మోదీ తొలిసారి జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ అనే అంశం తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటివరకు 1952 నుంచి 1967 మధ్యలో నాలుగు సార్లు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. దీంతో అప్పటికప్పుడు ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈక్రమంలో జమిలి ఎన్నికల అంశం కనుమరుగు అయ్యింది. అప్పటి నుంచి ఐదేళ్లు పూర్తి అయిన ప్రతి రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More