క్రాక్ సినిమా కధ కాపీనా…?

లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మాస్ మహారాజా రవితేజ కెరీ ర్ లోనే పెద్ద హిట్ నమోదు చేసుకున్న ”క్రాక్” సినిమా కథ తనదే నంటూ ఓ కధా రచయిత న్యాయ పోరాటానికి దిగాడు… విడుదల సమయంలో తమిళ సినిమా సేతుపతి ని కాపీ చేసి తీసారంటూ కామెంట్లు వచ్చినా అది పెద్దగా వివాదం కాలేదు.. ఒంగోలు హత్యల నేపధ్యం కటారి కృష్ణ జీవితానికి సంబంధించిన కథగా చెప్పిన ఈ చిత్రం కరోన విపత్కర పరిస్థితుల తరువాత సూపర్ హిట్ ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే… అయితే ఇన్నాళ్ల తరువాత ఆ కధ నాదేనంటూ హైదరాబాద్ అల్వాల్ కు చెందిన శివ సుబ్రహ్మణ్యం అనే రచయిత పోలీస్ స్టేషన్ తలుపు తట్టాడు… 2015 లో తాను రాసిన బల్లెం అనే దానినుంచి కాపీ చేసారని ఆయన ఆరోపించారు..కధ , కధనం అంత బల్లెం కధ నుంచే తీసుకున్నారని తన అనుమతి లేకుండా.. తనకి క్రెడిట్ ఇవ్వకుండా ఇలా చెయ్యడం చట్టవ్యతిరేకమైన చర్య అని అంటున్నారు.. గతంలో ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు పిర్యాదు చేసానని నిర్మాత మధుసూధనరెడ్డి కి, హీరో రవితేజ కి, కథకుడు దర్శకుడు అయిన గోపిచంద్ మలినేనికి ఛాంబర్ నోటీసులు పంపినా వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం తోనే పోలీసులకు పిర్యాదు చెయ్యాల్సివచ్చిందని ఆ రచయిత చెప్తున్నారు… గతంలో ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ఫేక్ట్ సినిమా విషయం లో కూడా ఇలాంటి వివాదమే నెలకొంది .. ఆ చిత్రం విడుదలైన చాలా కాలం తరువాత మూల రచయితకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తూ సినిమా ఆదాయం లో రచయితకు కుడా భాగం కల్పించాలని వెల్లడించింది… ఈ తీర్పు కారణంగానే మిస్టర్ పర్ప్ఫెక్ట్ చిత్రం డిజిటల్ మాధ్యమాలలో దర్శనమివ్వ దు… అయితే క్రాక్ వివాదం ఎటువంటి టర్న్ తీసుకోబోతుందో చూడాలి.

Related posts

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి

గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More