విశాఖ పర్యాటక మణిహరమైన కైలాసగిరి నూతనంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల డమరుకం తో కూడిన త్రిశూల్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం ఉదయం కైలాసగిరి పై మహా శివుడు కి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం త్రిశూలం కు పూజలు చేశారు. రాష్ట్ర మున్సిపల్ మరియు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలసి ఆవిష్కరించారు. కైలాసగిరి ని ఒక పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయటం జరిగిందన్నారు. విశాఖ నగరాన్ని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని, వేల కోట్లు పెట్టుబడులు తీసుకువస్తున్నారు అని మంత్రులు పేర్కొన్నారు కైలాసగిరి పై ఈ రోజు ప్రారంభించిన త్రిశూల్ విశాఖ పర్యాటకానికి చిహ్నంగా నలుమూలల నుంచి కనిపించేలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందన్నారు. కైలాసగిరి నీ మరింత అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించటం కోసం సన్నాహాలు చేస్తున్నామన్నారు.

గాలుల తీవ్రతను తట్టుకునేలా త్రిశూల్ నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పటికే కైలాసగిరి పై శివ పార్వతుల విగ్రహాలు పర్యాకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో మహా శివుని ఆయుధం త్రిశూల్ ను హనుమంతవాక వ్యూ పాయింట్ వద్ద మరింత పర్యాటక చిరునామాగా త్రిశూల్ నిలుస్తుందన్నారు. పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీ భరత్ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు ఎమ్మెల్యే లు విష్ణు కుమార్ రాజు, వంశీ కృష్ణ శ్రీనివాస్ , పంచకర్ల రమేష్ బాబు , బండారు సత్యనారాయణ మూర్తి, నాగ మాధవి , VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ , మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, తదితరులు పాల్గొన్నారు

