తమిళనాడు ఎన్నికలలో అనూహ్య విజయం సాధించి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న జోసఫ్ విజయ్ తమిళ రాజకీయాలలో అరుదైన రికార్డ్ నెలకొల్పారు. రాజకీయాలలో ఒక పార్టీ ని నెలకొల్పి అతి తక్కువ కాలంలో అధికారం లోకి వచ్చి ప్రపంచ రికార్డ్ సాధించిన నందమూరి తారక రామారావు (NTR) తరువాత తమిళనాట అచ్చం అలాంటి ప్రజాదరణను, ‘మాస్’ ఇమేజ్ను సొంతం చేసుకొని ప్రజల మనిషి గా ఎదిగి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. విజయ్ పూర్వీకులది చిత్తూరు జిల్లా . మద్రాసు ప్రెసిడెన్సీ టైం కార్మికుడిగా తన తాత కన్యాకుమారికి వలస వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు . తదనంతరం తండ్రి చంద్రశేఖర్ గారు చైన్నై లో చదువుకుంటూ సినిమాలపై మక్కువతో స్క్రిప్ట్ రైటర్ గా సినీ జీవితం ప్రారంభించి డైరెక్టర్ గా ఎదిగారు. విజయ్ ని సినిమాల్లోకి తీసుకొచ్చిన తర్వాత విజయ్ ని చూసి వీడు హీరో ఏంట్రా అని అవమానించారు మొదట్లో విమర్శలు ఎదురైనా, విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా విజయ్ తన అభిమాన సంఘాలను ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ద్వారా సేవా సంస్థలుగా మార్చారు.ఉచిత విద్యా సాయం, అన్నదానం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం వంటి కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు.

2024లో తన పార్టీ పేరును తమిళగ వెట్రి కళగం ప్రకటించి, సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ ఇప్పుడు అనూహ్య విజయం తో తమిళ రాజకీయాలను శాసించనున్నారు
మొదట్లో ఈ అవమానాలు పట్టించుకోకుండా తన కెరీర్ పై ఫోకస్ పెట్టడం తోనే ఈ స్థాయికి ఎదిగాడు . ఈరోజు తమిళనాడు లో ఒక పెరియార్, ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత లను మించిన అత్యంత జనాదరణ పొందిన ఒక శక్తిగా విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నాడు.
