మరికొద్ది గంటల్లో రాజేవరో.. రాజీ ఎవరో తేలిపోనుంది. సమరాన్ని తలపించేలా జరిగిన మినీ సార్వత్రిక ఎన్నికలు దేశం లో పెద్దకాక నే రేకెత్తించాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి విషయంలో గెలుపోటములు ఎలా వున్నా పెద్దగా టెన్షన్ పడని జనాలు బెంగాల్ ఏమైపోతుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే తమిళనాడు లో హాంగ్ రాబోతోందా అన్న ఆలోచన కూడా ప్రజల మనసుల్లో చిచ్చు రేపుతున్న వేళ డీఎంకే పార్టీ ఆఫీసులో ద్రావిడ మోడల్2.0 డిజిటల్ బోర్డు. స్టాలిన్ 2.0కి మరికొన్ని గంటలే ఉన్నాయని డిజిటల్ బోర్డు రూపంలో కౌంట్డౌన్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా డిజిటల్ బోర్డు అందరిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే కేరళం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజా చర్య మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కౌంటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ వివరాల్లో ముఖ్యమంత్రి పదాన్ని తీసివేసి.. సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో అని చేర్చారు..!

సాధారణంగా ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తేలిపోయాక ఫలితాలను బట్టి మార్పులు చేయడం సహజం..! కానీ అందుకు భిన్నంగా ముందే తొలగించడం ఆసక్తిగా మారింది..! కాంగ్రెస్ బీజేపీ కేరళ నేతలు తాము ఓడిపోతున్నామని ముందే తెలిసిపోవడం వల్లే.. ఆయన అలాచేసి ఉంటారని సెటైర్లు వేస్తున్నారు..! లెఫ్ట్ పార్టీల నేతలు మాత్రం ఆయన చర్యను సమర్ధిస్తున్నారు..! విజయన్ ఆది నుండి నిబద్ధత కలిగిన నాయకుడని.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చేవరకు ఆపద్ధర్మంగా పదవిలో కొనసాగుతారని.. ఎలాగు ఫలితాలు కొన్ని గంటల్లో వస్తాయి కాబట్టి.. ఒక నియమావళికి కట్టుబడి అలా ముఖ్యమంత్రి పదాన్ని తొలగించి ఉంటారని ప్రత్యర్థి పార్టీల కామెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నారు..! ఆయన మొత్తంగా పదాన్ని తొలగించారు. మాజీ ముఖ్యమంత్రి అని పేర్కొనలేదు..! రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే వ్యక్తి కాబట్టి హుందాగా వ్యవహరిస్తున్నారని.. చిల్లర రాజకీయ మనస్తత్వంతో ఆలోచించే కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఎన్నికల కమిషన్.. రాజ్యాంగం పట్ల గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు..!
