కేసుల దర్యాప్తులో పోలీసులకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS నిందితుల కదలికలను పసిగట్టి పట్టించేలా చేయడంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది శాంతిభద్రతల పరిరక్షణకే కాకుండా, కేసుల దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రకృత పర్యవేక్షణ వ్యవస్థ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల డేటాను ఇది ఒకే చోట చేరుస్తూ అనుమానితుల కదలికలను ట్రాక్ చేయడానికి ఈ వ్యవస్థ ను ఏర్పాటు చేసారు. నేరాలు జరిగినప్పుడు గాని ఇతర అత్యవసర పరిస్థితుల్లో RTGS ద్వారా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది సాధారణ కెమెరాలు ఒకే వైపు చూస్తాయి, కానీ 360 డిగ్రీ కెమెరాలు చుట్టుపక్కల ఉన్న మొత్తం ప్రాంతాన్ని కవర్ చేస్తాయి. దీనివల్ల కెమెరాకు కనిపించని ప్రాంతాలు బ్లైండ్ స్పాట్స్ అనేవి ఉండవు.

ప్రస్తుతం పోలీసులు వాడుతున్న 360 నిఘా వ్యవస్థల్లో ఫేస్ రికాగ్నేనేషన్ Face Recognition తో పాటు ఆటోమాటిక్ నంబర్ ప్లేట్రికాగ్నేనేషన్ Automatic Number Plate Recognition (ANPR) వంటి ఫీచర్లు ఉంటాయి. నేరస్తుడు ఏ దారిలో వెళ్తున్నాడో ఒక కెమెరా నుండి మరో కెమెరాకు లింక్ చేస్తూ 360 డిగ్రీల కోణంలో గాలించడానికి ఇది దోహదపడుతుంది. దీనివలన నేరం జరిగిన ప్రదేశం నుండి నేరస్థుడు ఏ దిశలో వెళ్ళాడో కచ్చితంగా తెలుస్తుంది. పాత నేరస్థుల డేటాతో వీడియో ఫుటేజీని సరిపోల్చవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా అనుమానాస్పద వాహనాలను సులభంగా గుర్తించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఇది నేరాల అదుపులో పోలీసులకు ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది.
కేసు దర్యాప్తులో జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపివేస్తూ, నేరస్థులు రాష్ట్రంలో ఎక్కడ సంచరిస్తున్నా వారి కదలికలను ఆర్టీజీఎస్ సీసీకెమెరాలు ఇట్టే పట్టేస్తున్నాయి. ఆయా కేసుల్లో ఆ నిందితులకు సంబంధించిన సమాచారాన్ని కేసు నమోదైన పోలీసు స్టేషన్ పోలీసులకు చేరవేస్తున్నాయి. దీంతో పోలీసులు సమన్వయంతో వ్యవహరించి నిందితులను ఇట్టే పట్టుకుంటుని కేసులను విజయవంతంగా ఛేదిస్తున్నారు.

