Vaisaakhi – Pakka Infotainment

ఢిల్లీ హైకోర్టు కు టాలీవుడ్ సెలెబ్రెటీస్..

ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఒకప్పుడు అపురూపం అని అనిపించేవి అన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (AI) పుణ్యమాని సర్వ సాధారణం గా కనిపిస్తున్నాయి. ఈ సాంకేతిక ప్రగతి కొందరికి అద్భుతం అనిపిస్తే మరికొందరికి తలనొప్పిగా మారింది. అందులో సెలెబ్రెటీలు ముందువరుసలో వున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలెబ్రెటీల పేర్లు, గొంతు, రూపం, అన్నీ వ్యాపార వస్తువులుగా మారిపోయాయి. అందుకే, వీటిని ఇతరులు తమ అనుమతి లేకుండా వాడుకోకుండా ఉండేందుకు భారతీయ సెలెబ్రెటీలు ఇప్పుడు పర్సనాలిటీ రైట్స్ Personality Rights కోసం న్యాయపోరాటం చేస్తున్నారు మొన్న రాంచరణ్, నిన్న జూనియర్ ఎన్ఠీఆర్,ఈరోజు అల్లు అర్జున్ ఇలా ఒక్కొక్కరు తమ పర్సనాలిటీ రైట్స్ కాపాడుకోడానికి కోర్టు లను ఆశ్రయిస్తున్నారు.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ Deepfake వంటి టెక్నాలజీలు పెరిగిన తర్వాత సెలెబ్రెటీల ఆందోళన మరింత ఎక్కువైంది.వాళ్ళు చెప్పని మాటలను వారు చెప్పినట్లుగా సృష్టించి గాసిప్ చెయ్యడం కాంట్రవర్సీ లను క్రియేట్ చెయ్యడం ఇటీవల కాలం లో ఎక్కువయ్యాయి. అలాగే నటీమణుల విషయం లో అశ్లీల చిత్రాలు వీడియో లు పోస్ట్ చేస్తున్న వివాదాలపైనే కాకుండా వారి ఫోటోలు, క్యారికేచర్లు వారి గొంతు ను అనుకరించి AI వాయిస్ క్లోనింగ్ చేయడం. అదే విధంగా వారి సంతకాన్ని వాణిజ్యపరంగా వాడటం. తన ప్రమేయం లేకుండా, వారి గుర్తింపును వాడుకుని ఇతరులు లాభపడకుండా చూడటమే ఈ హక్కుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్లు తీసుకునే నటీనటుల ఫోటోలను ఉచితంగా వాడుకుని కొన్ని కంపెనీలు లాభపడుతున్న దానిపై కూడా
సెలెబ్రెటీలు పోరాడుతున్నారు.

ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు..?

ఇటీవల అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రజనీకాంత్ (మద్రాస్ హైకోర్టు), రకుల్ ప్రీత్ సింగ్ జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ వంటి వారు కోర్టులను ఆశ్రయించారు. వీళ్లంతా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి కొన్ని కారణాలు లేకపోలేదుచాలా డిజిటల్ అండ్ టెక్నాలజీ కంపెనీల కార్యాలయాలు వారి ప్రతినిధులు ఢిల్లీలో ఉండటం. ఒక కారణమైతే ఇలాంటి కేసులను డీల్ చేయడంలో ఢిల్లీ హైకోర్టుకు ప్రత్యేక విభాగంతో పాటుగా అనుభవం ఉంది. గతంలో అమితాబ్ బచ్చన్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ‘జాన్ డో’ (John Doe) ఆర్డర్ అంటే ఎవరైనా సరే తన అనుమతి లేకుండా తన పేరు, వాయిస్, ముఖచిత్రాన్ని వాణిజ్య అవసరాలకు వాడకూడదని 2022లోనే ఇంజంక్షన్ ఆర్డర్ పొందారు.అలాగే నటుడు అనిల్ కపూర్ తన ముఖం, గొంతుతో పాటు తన పాపులర్ డైలాగ్ “ఝకాస్” (Jhakaas) కూడా వాడుకోకుండా కోర్టు స్టే ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్, రష్మీక మందన్న వంటి వారు తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ కారణం గానే మిగిలిన వారు కూడా ఢిల్లీ కోర్టును ఆశ్రయిస్తున్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) లో భాగంగానే ‘రైట్ టు ప్రైవసీ’ ఉంది. పర్సనాలిటీ రైట్స్ కూడా ఇందులో భాగమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More