పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో కలిసి కూటమి గా ముందుకు సాగుతున్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల స్థానిక నాయకుల మధ్య ఎవరు బాస్..? అనే ఆధిపత్య పోరు రాను రాను ఎక్కువవుతోంది ముఖ్యంగా వైసీపీ నుండి వచ్చి జనసేనలో చేరిన నాయకులకు, పాత టీడీపీ కేడర్కు మధ్య ఉన్న గ్యాప్ ను మరింత పెంచుతోంది.
పిఠాపురంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గతంలో కంటే కొంత ఉద్రిక్తంగా మారాయనే చెప్పవచ్చు కూటమిలో ఉంటూ పాలన లో భాగస్వామ్యులైన ఉభయపార్టీల నేతలు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరు తో నువ్వా నేనా అని మాటల యుద్దాన్ని మొదలుపెట్టారు.
మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ (టీడీపీ) పెండెం దొరబాబు (జనసేన) మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న వివాదాలు ఉంటే వాటిని అధిష్టానం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలే తప్పా ఇలా పార్టీ పరువు తీయకూడదన్నట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వర్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని లేదా ఆయనను వివరణ కోరవచ్చని వార్తలు వస్తున్నాయి.
అన్నిటినీ వర్మే కారణమా..?

పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA) ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు ట్యాబ్లు, మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం
కేవలం ఉపముఖ్యమంత్రి ఫోటో మాత్రమే ఉండటం ప్రోటోకాల్ ఉల్లంఘన అని ఆవేశంలో వర్మ అక్కడున్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని చింపివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన పెండెం దొరబాబు ఈ ఉదంతంపై స్పందించడంతో గొడవ పెద్దదై ఒకరికొకరు నిలదీయడం, నెట్టుకోవడం వరకు వెళ్లి వివాదం పెద్దదైంది. మాజీ ఎమ్మెల్యే వైఖరి వల్ల కూటమికి నష్టం జరుగుతోందని దొరబాబు ఆరోపించారు. దొరబాబు వంటి వలస నాయకుల పెత్తనం ఇక్కడేంటని 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమికి కృషి చేసిన వారు ఇప్పుడు జనసేన ముసుగులో వచ్చి టీడీపీ కేడర్ను టార్గెట్ చేస్తున్నారన్న వర్మ ఆరోపణలకు జనసేన నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. వలస విషయంలో చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ కి వలస వచ్చినవారే అన్న ప్రశ్న ఉధృతి ని మరి పెంచినట్లయింది.

నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకే ప్రాధాన్యత ఉండాలని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారని రాష్ట్రంలో మిగిలి ఉన్న 174 నియోజక వర్గాల్లో జనసేన నాయకుల, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పేరు లేదు అని, పోటో లేదు అని ఉద్యమాలు చేయడం మొదలు పెడితే టీడీపీ ఇలానే మౌనం వహిస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మిత్ర ధర్మం తో ఉండాల్సిన వారు లోకేష్ ని, బాలకృష్ణ ని, బీజేపీ కి చెందిన పురందేశ్వరి ని ఈ వివాదం లోకి లాగడం. అలాగే పార్టీ పరం గా సీ రామచంద్రయ్య లాంటి నేతలను తిరిగి చేర్చుకోవడం వంటి అధిష్టాన నిర్ణయాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కరుగా జనసేన నేతలు తమ స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టారు. కూటమి అధికారం లోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడో ఒకచోట ఇలాంటి వివాదం వచ్చినా ఇరుపార్టీల నేతలు కార్యకర్తలను సముదాయిస్తూ పరిస్థితిని సద్దుమణిగేలా చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చర్యలు కచ్చితంగా వుండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రచ్చ రాజేసిన నేతలపై దిద్దుబాటు చర్యలు కు దిగినట్లు కూడా సమాచారం.
