2020 కరోనా లాక్డౌన్ సమయంలో తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఈ కేసుకు సంబంధించి మదురై కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
జూన్ 19, 2020న లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు షాపు తెరిచి ఉంచారనే నెపంతో పోలీసులు వీరిని స్టేషన్కు తీసుకెళ్లి
స్టేషన్లో వీరిద్దరినీ రాత్రంతా అమానుషంగా చిత్రహింసలకు గురిచేశారు. జూన్ 20న వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించారు.
అప్పటికే తీవ్ర గాయాలపాలైన బెన్నిక్స్ జూన్ 22న అతని తండ్రి జయరాజ్ జూన్ 23న చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. మొదట మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును CBIకి అప్పగించింది.
అదే స్టేషన్లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ (రేవతి) ధైర్యంగా ముందుకు వచ్చి, ఆ రాత్రి జరిగిన హింస గురించి సాక్ష్యం చెప్పారు. బాధితులు అసలు లాక్డౌన్ నిబంధనలే ఉల్లంఘించలేదని, పోలీసులు కావాలనే వారిపై దాడి చేశారని సీబీఐ తన ఛార్జిషీట్లో పేర్కొంది.
కొన్ని కొన్ని సందర్భంలో మనసాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. జరిగినది బయటికి రాకూడదనే ఒత్తిడి.. సాక్ష్యాలను తుడిచేసి కథను మొత్తం మార్చేయాలి… ఇవే ప్రధాన లక్ష్యాలు
ఇలాంటి సమయంలో చాలా మంది సైలెంట్గా ఉండటాన్నే సేఫ్గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు… తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత తనపై వేసుకుంది. తోటి సిబ్బంది ఒకవైపు… పై అధికారుల ఒత్తిడి మరోవైపు… ఇలాంటి పరిస్థితిలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు… ఆ రాత్రి జరిగిన వాస్తవానికి మొదటి స్పష్టమైన రూపం. పోలీసులు స్టేషన్ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మేజిస్ట్రేట్కు చూపించారు.
ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి.
సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, ఆమె తన జ్ఞాపకశక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తుకు దిక్సూచిలా నిలిచారు.
ఇది సాధారణ విషయం కాదు. అదే వ్యవస్థలో ఉండి, అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే చాలా పెద్ద నిర్ణయం. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.ఆమె చెప్పిన విషయాల ఆధారంగా కేసు బలపడింది. కోర్టు కూడా ఆమె భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేక రక్షణ కల్పించింది. అది ఆమె చెప్పిన నిజానికి వచ్చిన గుర్తింపు. రేవతి చేసిన పని గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది చాలా సింపుల్ — జరిగినదాన్ని దాచలేదు.
కానీ అదే సమయంలో చాలా మంది చేయలేని పని అదే. సాత్తాన్కుళం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలా ఉండొచ్చు…
కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే — రేవతి.
next post
