“ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” ట్రైలర్ రిలీజ్

అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

నికోబార్ ఐల్యాండ్స్ లో ఉన్న ప్రైవేట్ ఐల్యాండ్ మోక్ష ను విజిట్ చేసేందుకు వెళ్తారు ఆ ఐల్యాండ్ వారసులు. మోక్ష ఐల్యాండ్ లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టిస్తాడు. అతనికి ప్రతిబింబం లాంటిదే ఈ ఐల్యాండ్. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన వారసులకు అనూహ్యమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వీరి హత్యలకు కారణం ఏంటి ?, అందమైన మోక్ష దీవిలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎవరు సృష్టిస్తున్నారు ?. వారసులనే ఎందుకు టార్గెట్ చేశారు ? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” సిరీస్ పై కావాల్సినంత క్యూరియాసిటీని ట్రైలర్ క్రియేట్ చేస్తున్న ఈ సీరీస్ ని అనీష్ యెహాన్ కురువిల్లా డైరెక్ట్ చేసారు..

Related posts

కృతజ్ఞత అంటే అట్లుంటుంది..

సీనియర్ నటుడు ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం పై పుస్తకం

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More