మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

రేపటి నుండి ఏపీ వ్యాప్తంగా ఉన్న వైన్స్‌ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె సైరన్ మోగిస్తున్నారు.. గత ప్రభుత్వ హయాంలో తమను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని కానీ.. ఇప్పుడు తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే.. 15 వేల మంది కాంట్రాక్ట్‌, ఔవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డున పడతారని వాపోతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకే రేపు నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయానికొచ్చారు.

అక్టోబర్ నుంచి కొత్త పాలసీ…

అక్టోబర్‌ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని.. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

మద్యం రేట్లు తగ్గే ఛాన్స్..

మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం నిషేధం పేరుతో.. ధరలను విపరీతంగా పేంచేసి, నకిలీ బ్రాండ్లను దించేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Related posts

మోదీ మెచ్చిన మన కాఫీ

చాయ్ కహానీ తెలుసుకో భాయ్..

క్రెడిట్ కొట్లాట

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More