మే 2 వ తేదీన దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం ‘సాచెట్’ (SACHET_ అనే కొత్త సిస్టం తయారు చేసింది. దీని పనితీరు ను పరీక్షించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖDepartment of Telecommunications
విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. మీ మొబైలు ఒక మెసేజ్ తో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నా సరే, పెద్దగా సైరన్ లాంటి శబ్దం వినిపిస్తుంది.అలాగే ఫోన్ గట్టిగా వైబ్రేట్ అవుతూ స్క్రీన్ మీద ఒక ‘ఫ్లాష్ మెసేజ్’ కనిపిస్తుంది. ఇది కేవలం ఒక టెస్ట్ మెసేజ్ మాత్రమే.
మీ ఫోన్ హ్యాక్ అవ్వలేదు, అలాగే ఎటువంటి ప్రమాదం లేదు. ఆ మెసేజ్ చివరలో “This is a TEST MESSAGE” అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత ‘OK’ లేదా ‘Dismiss’ బటన్ నొక్కితే ఆ శబ్దం ఆగిపోతుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఢిల్లీ, ఎన్.సి.ఆర్ (NCR) మరియు అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో ఉన్న మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ మెసేజ్లు వస్తాయి. ఈ మెసేజ్లు ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరుతుంది.
వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్ లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.