ఆంధ్రాయూనివర్సిటీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వంద రూపాయల స్మారక నాణేన్ని Commemorative Coin విడుదల చేసింది. శతాబ్ది ఉత్సవాల్లో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సమక్షంలో ఆవిష్కరించిన ఈ నాణెం ముఖ్య విశేషాలు ఒకసారి పరిశీలిస్తే నాణెం ముందు భాగం మధ్యలో అశోక చక్రం దాని కింద ‘సత్యమేవ జయతే’ హిందీలో భారత్ అని ఇంగ్లీష్లో ‘INDIA’ తో పాటు ₹100 విలువ ముద్రించి ఉంది అలాగే వెనుక భాగం మధ్యలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక చిహ్నం logo ఉంటుంది. దానికి ఎడమ వైపున ‘1926’, కుడి వైపున ‘2026’ సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. అలాగే ‘ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది సంవత్సరం’ అని హిందీ,ఇంగ్లీష్ భాషల్లో రాసి ఉంటుంది. సాంకేతిక వివరాలకు వస్తే ఈ వంద రూపాయల నాణెం బరువు 35 గ్రాములు కాగా దీనిని 50% వెండి (Silver), 40% రాగి, 5% నికెల్, 5% జింక్ లోహాల మిశ్రమాలతో హైదరాబాద్ మింట్ (Government of India Mint, Hyderabad) తయారు చేసింది. ఈ వంద రూపాయల నాణెం సాధారణ చలామణిలో వాడలేము. ఇది కేవలం జ్ఞాపకార్థం (Collector’s Item) మాత్రమే విడుదల చేసింది రిజర్వ్ బ్యాంకు దీనిని భారత ప్రభుత్వ మింట్ అధికారిక వెబ్సైట్ (indiagovtmint.in) ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దీని ధర ప్యాకేజింగ్ బట్టి ధర సుమారు ₹7,790 నుండి ₹7,880 వరకు ఉంటుంది. అలాగే శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నాణేంతో పాటు ప్రత్యేక పోస్టల్ స్టాంపునుకూడా విడుదల చేశారు.