కట్టు తప్పుతున్న కమెడియన్లు
ఒకప్పుడు హాయిగా ఆహ్లాదంగా సాగే జీవితాలన్నీ ఇప్పుడు అత్యంత సిస్టమేటిగ్గా.. ఇంకాస్త వాస్తవంగా చెప్పుకోవాలంటే మరింత మెకానికల్ గా మారిపోయాయి. మనిషి మనీ మేకర్ గా ఎప్పుడైతే మారిపోయాడో అలవాట్లు వ్యవహారాలు అన్ని పూర్తిగా చేంజ్ అయిపోయాయి ఈ బిజీ లైఫ్ లో మనిషి పూర్తిగా నవ్వడం పూర్తిగా మర్చిపోయాడు హార్ట్ ఫుల్ గా నవ్వే రోజులు హఠాత్తుగా మాయం అయిపోయాయి అలాంటి లైఫ్ లో మిస్ అయిపోయిన నవ్వుల్ని ఇప్పుడు టికెట్ పెట్టి మరి కొనుక్కుంటున్నాడు. స్టాండప్ కామెడీ పేరుతో ఒక క్లోజ్డ్ గదిలో పక్కవాళ్ళపై వేసే కుళ్ళు జోకులకు తాను ఆనందిస్తున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా ఆ షోలు ఇప్పుడు గతి తప్పుతున్నాయి. వ్యక్తిత్వ హననంతో ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా కామన్ సెన్స్ మర్చిపోయి కామెడీ చేయడం మొదలుపెట్టారు. అనుదీప్ కటికల అన్న ఒక స్టాండప్ కమెడియన్ ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు రామ్ చరణ్ ఎమ్మెల్సీ నాగబాబు కూతురు నిహారికలపై వివాదాస్పద కామెడీ చేయడంతో కొంతమంది మెగా అభిమానులు అనుదీప్ పై దాడికి యత్నించారు. రామ్ చరణ్ ఆర్థిక స్థాయి గురించి నిహారిక విడాకుల గురించి తన కామెడీలో చొప్పించి వెటకారం చేసాడు. కూర్చున్న ఆడియన్స్ నవ్వుతున్నారు కదా అని వాళ్ళ వ్యక్తిత్వ జీవితాలను వ్యంగ్యం గా ప్రస్తావించటం అభిమానులకు కోపం తెప్పించింది. దీ స్ట్రీట్ అన్న కామెడీ క్లబ్ పై దాడి చేసి షోను ఆపించడంతో స్టాండప్ కమెడియన్ అక్కడి నుంచి పరారయ్యాడు. తొలుత అజ్ఞాతానికి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, వార్నింగ్స్ ఎక్కువ అవడంతో చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయితే స్టాండప్ కామెడీలో వివాదాలు దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు చివరిది అంతకంటే కాదు. గతంలో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు ఉన్న స్టాండప్ కళాకారులు ఈ వివాదాల ఒరవడిని మాత్రం వదలడం లేదు.
అసలు ఎక్కడి నుంచి వచ్చింది..!
కళలు వర్ధిల్లుతున్న రోజుల్నుంచి కూడా అన్ని ప్రక్రియల్లో హాస్యరసానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వీకులు. తరతరాల నుంచి హరికథ, బుర్రకథ, ధ్వన్యానుకరణ (మిమిక్రీ) వంటి వాటిల్లో ప్రత్యేకంగా జోక్స్ చెప్పించే విధానం మొదలైంది పిట్టలదొర అన్న గ్రామ జానపదం లో కూడా ఈ ఛాయలే ఎక్కువ కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ప్రత్యేకంగా ఇలా ఒక్కరే చెప్పే కామెడీ, జోకులు చెప్పే విధానాన్ని స్టాండప్ కామెడీగా పిలవడం మొదలుపెట్టారు. 18వ శతాబ్ది నుంచి మొదలైన ఈ విధానం 1950 60 ప్రాంతాల మధ్య మార్ట్ సాఫ్లే అనే కళాకారుడు ఒక కుర్చీ వేసుకొని అప్పటి వార్తాపత్రికలో వచ్చే రాజకీయాలు, సంఘటనలు వంటి వాటిపై హాస్యం జోడించి చెప్పడం సెటైరికల్ గా విశ్లేషణ చేయడంతో ఈ మాధ్యమం విశేష ప్రాచుర్యాన్ని పొందింది. మన దేశంలో 1980 ప్రాంతంలో విఖ్యాత హాస్యనటుడు జానీ లివర్ వేదికలపై జోక్స్ చెప్తు నవ్వులు పంచేవారు ‘కామెడీ షో’ (comedy show) గా పిలవబడే ఈ షోలు విపరీత ఆదరణ పొందాయి అదే విధంగా తెలుగునేల పై హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ‘పకపకలు’ పేరుతో దూరదర్శన్ లో కామెడీ షో చేసేవారు అనేక వేదికలపై కూడా నవ్వించి ప్రశంసలు అందుకున్నారు నటులు ఆలీ, వేణుమాధవ్ వంటి వారు కూడా కొన్ని వేదికలపై ఈ తరహా షో లను నిర్వహించారు. 2005 నుంచి ఈ తరహా స్టాండ్ అప్ కామెడీ కి విశేష ఆదరణ లభించింది అని చెప్పాలి.స్టార్ టీవీ లో ప్రసారమైన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ (The Great Indian Laughter Challenge) దీని దశ దిశ మార్చిందనే చెప్పాలి. భారతదేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రతిభవంతులు ఈ షో లో పాల్గొని పెద్ద విజయాన్ని అందించారు ఎన్నో సీజన్ల పాటు కొనసాగిన తర్వాత అందులో పాల్గొన్న అనేకమంది సెలెబ్రెటీలు గా మారి వేల షోల తో అలరించారు. సోషల్ మీడియా రాకతో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి వ్యక్తిగత ఎకౌంట్లో ద్వారా ఎందరో స్టాండప్ కమెడియన్ లు గా సెలబ్రిటీ హోదా పొందారు. ఓటీటీ రంగం కూడా దీన్ని అతిపెద్ద ఎంటర్టైనర్ విభాగంగా భావించడంతో స్టాండప్ కామెడీ అనేది పెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందింది.
నవ్వులు ఎన్నో..! వివాదాలు అన్నే..!!
ఎవరి మనసులను నొప్పించకుండా హాయిగా నవ్వించగలగడమే నిజమైన హాస్యం మరి ఈరోజు ఎందుకు అపహాస్యంగా మారి వివాదాలకు బాటలు వేస్తోంది అంటే సున్నితమైన హాస్యాన్ని సృష్టించలేక వ్యక్తిత్వ హననం పైన, బాడీ షేమింగ్ పైన స్టాండప్ కామెడీ సృజన ఆధారపడుతుంది. హాల్లో ఉండే వందో నూటయాబై మందో ఆ టైంలో నవ్వుతున్నప్పటికీ అదే కంటెంట్ మీడియాకి, సోషల్ మీడియా కి వచ్చేసరికి ఎందుకు వివాదాస్పదం అవుతుందంటే వారూ ఎంచుకున్న కంటెంటే హండ్రెడ్ పర్సెంట్ కారణం కొంతమంది స్టాండప్ కామెడీ లో మసాల(వివాదం) ఉంటేనే పాపులర్ అవుతామన్న కోణం కూడా ఉండడంతో అలాంటి కంటెంట్ ఎంచుకుంటున్నారు అన్న అపవాదు కూడా లేకపోలేదు. 2022లో మునావర్ ఫారూఖీ (Munawar Faruqui) అనే స్టాండప్ కమెడియన్ డోంగ్రి టు నో వేర్ (Dongri to nowhere) షోను హైదరాబాదులో నిర్వహిస్తే ఆ షోను అడ్డుకుంటామని హిందుత్వ వాదులు హెచ్చరించి భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. రాజకీయ వివాదం గా తీసుకున్న అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావించడం తో దీన్ని ఎలాగైన జరపాలని నిర్ణయించిన వందలాదిమంది పోలీసులతో షో జరిగేలా చర్యలు తీసుకుంది. హిందూ దేవీ దేవతలపై జోకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడన్న అభియోగంతో ఈ షో వివాదాస్పదమైంది. నవ్వుకునే షో ఇంత పోలీసు భద్రత మధ్య జరగాలా..? అన్న వ్యాఖ్యలు బహిరంగంగానే ప్రజల నుంచి వినిపించాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుకుంటున్నప్పటికి ఇతరులను కించపరుస్తూ వారి రాజ్యాంగ హక్కును హరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించేవారు కూడా చాలామందే ఉన్నారు. ఇక వివాదాల విషయంలో గతంలో వీర్దాస్ అన్న కమెడియన్ ‘నేను రెండు భారతదేశాల నుంచి నేను వచ్చాను’ అన్న కామెంట్స్ పై ప్రపంచ వ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందిన మరో కమెడియన్ హిందూ పండుగలు ఆచారాలపై కామెంట్ చేయడం కూడా వివాదాస్పదమైంది ఆండ్ర్యూ షూల్జ్, ఆకాశ్ సింగ్, రికీ గెర్వైస్ వంటి స్టాండప్ కమెడియన్లు మత వ్యతిరేక వ్యాఖ్యలతో వివాదాలను మూటకటుకున్నారు హాస్యమైన దృశ్యమైన అది పరిధిలో ఉండి ప్రేక్షకులను అలరిస్తే అందం. వ్యవస్థ లను, మతాచారాలను వ్యక్తిగత స్వేచ్ఛను హాస్యం లోకి లాగుతే అది అపహాస్యం అవడమే కాదు. శిక్షార్హులను కూడా చేస్తుంది.