యూపీఐ బాదుడు మొదలైందా..?అసలు నిజమేంటి..?

యూపీఐ (UPI)లావాదేవీలపై రెండువేల రూపాయిల లావాదేవీలు దాటితే ఛార్జీలు పడతాయి అన్న ప్రచారం తో వినియోగదారుల్లో అలజడి మొదలైంది. వివిధ మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు, అసత్య వార్తలు చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం యూపీఐ లావాదేవీలకు, అన్ని రకాల RuPay డెబిట్ కార్డ్ చెల్లింపులకు బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. ​ఒకవేళ భవిష్యత్తులో ఛార్జీలు అమలులోకి వచ్చినా, అది కస్టమర్లపై కాదు… కేవలం వ్యాపారులపై (Merchant Payment Ecosystem) మాత్రమే పడుతుంది. ​వ్యాపారులు మీ దగ్గర అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని, Google Pay, PhonePe వంటి యాప్‌లు “ప్లాట్‌ఫారమ్ ఫీజు” పేరుతో దొడ్డిదారిన ఛార్జీలు వేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ​భారతదేశంలో జరిగే మొత్తం UPI లావాదేవీలలో 96% లావాదేవీలన్నీ రెండువేల లోపు ఉండేవే. కాబట్టి ఈ చర్చ కేవలం మిగిలిన 4% భారీ వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది, సామాన్యులకు కాదు. ​ఇది కొత్త ఛార్జీ కాదు, వినియోగదారుల రక్షణ కోసం మాత్రమే.


2020 జనవరిలో CBDT యూపీఐపై MDR (వ్యాపారి బ్యాంకుకు చెల్లించే కమీషన్)ను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ₹2,000 వరకు ఉచితం అనే నిబంధనకు చట్టబద్ధమైన రక్షణ కల్పించింది. భవిష్యత్తులో భారీ వాణిజ్య లావాదేవీలపై నామమాత్రపు MDR పరిశీలించే అవకాశాన్ని మాత్రమే తెరిచి ఉంచింది. ​ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట రుసుములను ప్రకటించలేదు. “0.25% నుండి 0.4%, గరిష్టంగా ₹300” అనే వార్తలు కేవలం మీడియా ఊహాగానాలు మాత్రమే. 2023 నుంచే పేటీఎం(Paytm) ఫోన్ పే(PhonePe) వంటి యాప్స్ ద్వారా రెండు వేలు దాటిన లావాదేవీలపై 1.1% ఇంటర్‌చేంజ్ ఛార్జ్ ఉంది. మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా చేసే సాధారణ UPI లావాదేవీలకు ఈ ఛార్జీ అస్సలు వర్తించదు. ఒకవేళ ఛార్జీలు వేస్తే చెల్లించాల్సింది
​సామాన్యులు కాదు… కేవలం బడా వ్యాపారులు మాత్రమే!
​నెలకు ఇరవైలక్షలకు పైగా UPI కలెక్షన్లు ఉండే సూపర్‌మార్కెట్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, పెద్ద ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు మాత్రమే వీటిని చెల్లించాల్సి వుంటుంది.
​రోడ్డు పక్కన పండ్ల వ్యాపారులు, టీ కొట్లు, మీ వీధిలోని చిన్న కిరాణా దుకాణాలకు దీని నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. సేకరించిన ​ఆ నామమాత్రపు మొత్తం లో ​60% భారతీయ బ్యాంకులకు
​30% UPI వ్యవస్థను నడిపే NPCIకి
​10% పేమెంట్ సర్వీస్ యాప్‌లకు చెందుతుంది. ​ప్రతి UPI లావాదేవీ వెనుక భారీ నిర్వహణ ఖర్చు ఉంటుంది. సెకనుకు కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసే సర్వర్లు, మోసాలను అరికట్టే AI సెక్యూరిటీ వ్యవస్థలకు బ్యాంకులు నిరంతరం ఖర్చు చేయాలి.
​ఇప్పటివరకు దీన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరించింది. ప్రస్తుతం రోజుకు 50 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతుండటంతో బ్యాంకులపై సర్వర్ భారం విపరీతంగా పెరిగింది.
​ప్రజలకు ఈ సేవలు నిరంతరం ఉచితంగా కొనసాగేందుకు ప్రభుత్వం ఇప్పటికీ ఏటా ₹1,500 కోట్లు UPI ఇన్సెంటివ్‌గా బ్యాంకులకు అందిస్తోంది. ​భారతదేశంలోని UPI మార్కెట్‌లో దాదాపు 80% Google Pay, PhonePe చేతుల్లోనే ఉన్న మాట వాస్తవం. MDR వస్తే వారి లాభాలు కూడా కొంత పెరుగుతాయి. అలాగే UPI, RuPay రాకతో Visa, Mastercard కంపెనీల ఆదాయం తగ్గి లాబీయింగ్ చేశాయన్న వార్తలూ వచ్చాయి.ఈ నిధుల్లో సింహభాగం (60%) వెళ్లేది అమెరికన్ కంపెనీలకు కాదు, భారతీయ బ్యాంకులకే. ఇది విదేశీ కంపెనీల కోసం తీసుకున్న నిర్ణయం కానే కాదు, భారత బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక స్థిరత్వం కోసం మాత్రమే

Related posts

వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు ఏం జరిగింది?

సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న 80’s ట్రెండ్

స్వర్ణయుగం తిరిగొచ్చిందా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More