పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం !!!

అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు లత సమర్పణలో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ మరియు వైజాగ్, కోడై కెనాల్ లో జరగనుంది. నవంబర్ 14 నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

డైరెక్టర్ రావు జి.ఎం.నాయుడు మాట్లాడుతూ…
పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుంది… మనం ఏదైనా పైన ఉన్న భగవంతుడి ఆదేశాల మేరకు నడుస్తాము అనే పాయింట్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలిపారు.

నిర్మాత అల్లు సాయి లక్ష్మణ్ మాట్లాడుతూ…
జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. లవ్, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా షూటింగ్ సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నాము, మాకు సహకరిస్తున్న మీడియా వారందరికీ ప్రేత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారుపవన్ శంకర్, యాని, తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts

విశాఖ పర్యాటకానికి సరికొత్త త్రిశూల్ శోభ

ఢిల్లీ హైకోర్టు కు టాలీవుడ్ సెలెబ్రెటీస్..

బడ్జెట్ ఓవర్‌లోడ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More