స్పీక‌ర్ స్థానానికి గౌర‌వం పెరిగేలా ప‌ని చేస్తా..

అయ్య‌న్నపాత్రుడు

స్పీక‌ర్ ప‌ద‌వీ స్థానానికి మ‌రింత గౌర‌వం పెరిగేలా ప‌ని చేస్తాన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అన్నారు. అతి చిన్న వ‌య‌సులో ఎన్టీఆర్ మంత్రి ప‌దవి ఇచ్చార‌ని, ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు స్పీక‌ర్ ప‌దవి ద్వారా అత్యున్న‌త గౌర‌వం ఇచ్చి ప్ర‌ధాన బాధ్య‌త‌లు అప్ప‌గించార‌న్నారు. ముఖ్య‌మంత్రి నమ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని, ప‌రిమితుల‌కు లోబ‌డి హుందాగా ప‌ని చేస్తాన‌ని పేర్కొన్నారు. విశాఖ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం చేరుకున్న ఆయ‌న‌కు విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా ఇన్ఛార్జి క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, పోలీస్ క‌మిష‌న‌ర్ డా.ఎ. ర‌విశంక‌ర్, అన‌కాప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ ర‌వి ప‌ట్టన్ శెట్టి, ఎస్పీ మ‌ర‌ళీకృష్ణ‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సత్కరించి ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అనేక మంది ప్రముఖులతో అయ్యన్నపాత్రుడు ఆయా అంశాలపై సరదాగా ముచ్చటించారు. జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాసరావు, తెదేపా నాయకులు చోడే వెంకట పట్టాభిరాం, రెడ్డి నారాయణరావు తదితరులు అయ్యన్న ను కలుసుకున్న వారిలో ఉన్నారు

Related posts

క్రెడిట్ కొట్లాట

వినాయకుడు కొలువుండేది ఈ సారి తొమ్మిది రోజులేనా..?

ఆ పేర్లు కనుమరుగా..? కొనసాగింపా.?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More