ఏపీకి 5,655.72 కోట్ల భారీ సాయం చేసిన కేంద్రం

ఎన్డీఏ కూటమి అభ్యర్థి గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ సాయంతో గుడ్ న్యూస్ చెప్పింది.ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. తుదిదశకు చేరుకున్న తరుణంలో ఈ వార్త ఆ వర్గాల్లో జోష్ నింపింది. జూన్‌ నెలలో ట్యాక్స్ డెవల్యూషన్‌లో భాగంగా విడుదల చేసిన నిధులకు అదనంగా మరో ఇన్‌స్టాల్‌మెంట్‌ను కూడా కేంద్రం ఇందులో జమ చేసింది. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మూల ధన వ్యయాల కోసం ఈ మొత్తం ఉప యోగపడుతుందని భావిస్తున్నారు.ఏపీ సహా మిగిలిన రాష్ట్రాలన్నింటికీ కలిపి 1,39,750 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం 12,19,783 కోట్లు. ఇందులో భాగంగా ఈ నిధులు విడుదల అయ్యాయని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.ఏపీ వాటాగా 5,655.72 కోట్ల రూపాయలు మంజూరు కాగా అరుణాచల్ ప్రదేశ్ కి 2,455.44, అస్సాం 4,371.38, బిహార్ 14,056.12, ఛత్తీస్‌గఢ్ 4,761.30, గోవా- 539.42, గుజరాత్- 4,860.56, హర్యానా- 1,527.48, హిమాచల్ ప్రదేశ్- 1,159.92 కోట్లు విడుదల అయ్యాయి.

Related posts

అసలు ఎవరీ అర్లేకర్..?

అధికార, ప్రతిపక్షాలతో కమ్యూనిస్టుల దోస్తానా..?

సౌత్ లో కమల వికాసం కష్టమా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More