తెలంగాణ ఒగ్గుక‌థ హైలైట్‌గా యేవమ్

తెలంగాణ సంస్కృతిలోని భాగమైన ఒగ్గుక‌థ‌ నేపథ్యంలో చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రంలో యేవమ్ హిందూ సంప్ర‌దాయంలోని గ్రామ దైవాల గొప్ప‌ద‌నాన్ని ఒగ్గుక‌థ‌ ద్వారా ఈ చిత్రంలో చూపించారు. ఒగ్గుక‌థ‌ను సినిమాలోముఖ్య అంశంగా చేర్చిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని చెప్పొచ్చు. ఈ ఒగ్గుక‌థ‌ను కూడా రియ‌ల్‌గా ఒగ్గుక‌థ‌ల‌ను పాడే ఒగ్గుక‌థ క‌ళాకారుల చేత‌నే చెప్పించ‌డం విశేషం. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఈ ఒగ్గుక‌థ లోని గాఢ‌త‌ను, స‌న్నివేశంలోని సారాంశంను చెప్పించ‌డంతో ప్రేక్ష‌కులు క‌థ‌లో ఇన్‌వాల్వ్ అవ్వ‌డ‌మే కాకుండా వారికి కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. ఈ నెల 14న విడుద‌ల కాబోతున్న ఈ చిత్రం అంద‌ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.ఈ చిత్రంలో చాందిని చౌద‌రిదిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలు. ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related posts

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి

గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More