శ్రీరామ్ హీరో గా “కోడి బుర్ర”

ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచతుడైన శ్రీరామ్ హీరోగా కొత్త మూవీ “కోడి బుర్ర” ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ లు నిర్మతలుగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహావీర్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ – కోడి బుర్ర చిత్రాన్ని మా మిత్రులు నిర్మిస్తున్నారు. మంచి కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్రేక్షకుల్ని ఈ మూవీ ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నన్నారు
హీరో శ్రీరామ్, దర్శకుడు చంద్రశేఖర్ కానూరి, హీరోయిన్లు శృతి మీనన్ ,ఆరుషి, నిర్మాతలు గట్టు విజయ్, కంచర్ల సత్యనారాయణరెడ్డి , నటుడు మహావీర్ తదితరులు మాట్లాడారు.

Related posts

విశాఖ పర్యాటకానికి సరికొత్త త్రిశూల్ శోభ

ఢిల్లీ హైకోర్టు కు టాలీవుడ్ సెలెబ్రెటీస్..

బడ్జెట్ ఓవర్‌లోడ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More