మేకర్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ‘ఇరుముడి’

ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇరుముడి ప్రేక్షకులకు సమ్మోహనమై అలరిస్తుంటే మేకర్స్ కు మాత్రం ఒక గుణపాఠం గా నిలిచిందన్న టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. సినిమా కు ఎంత బడ్జెట్ కావాలో అంతే పెట్టి బలమైన వసూళ్లు రాబట్టిన ఇరుముడి ఓవర్ బడ్జెట్ దర్శక నిర్మాతలకు ఘాటు సందేశం పంపిందంటున్నారు. ప్రభుత్వాలను బ్రతిమాలుకుని డబ్బింగ్ చిత్రానికి కూడా రేట్లు పెంచే సంస్కృతి తీసుకొచ్చిన నిర్మాతలకు ఈ విజయం కనువిప్పు కావాలని బలంగా కోరుకుంటున్నారు. రెండుమూడొందలు బడ్జెట్స్ పెట్టి ఐదుకొట్లో, పదికొట్లో ప్రాఫిట్ వస్తే బ్లాక్ బస్టర్ పోస్టర్ లు వేసుకుని వడ్డీలలో పదిశాతం కూడా రాలేదని లోలోపల బాధపడిపోయే సదరు నిర్మాతలను ఈ చిత్రం ఆలోచింపజేసిందని అంటున్నారు. నిజానికి ఇటీవల ఏ చిత్రానికి రానంత బజ్ ఈ చిత్రానికి వచ్చింది. నిలకడగా మొదలైన వసూళ్ళు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వైపు గా తీసుకెళ్ళాయి. కొన్ని సెంటర్లలో ఈ సినిమా తీసేసి మరో కొత్త సినిమా ప్రదర్శిస్తే ప్రేక్షకులు ధియేటర్ ముందు ధర్నా చేసేంతగా అభిమానాన్ని పొందిన చిత్రం ఈ మధ్యకాలం లో మరొకటి లేదు. అప్పట్లో కొంతమంది ధియేటర్ యజమానులు వంద రోజులు సినిమా ఆడితే సిబ్బందికి బోనస్ ఇవ్వాల్సొస్తుందని 99రోజులకే సినిమాను ధియేటర్ నుంచి తొలగించిన సందర్భంలో ఆ నటుడి అభిమానులు మాత్రమే రికార్డ్ పోతుందని ధియేటర్ దగ్గర హంగామా సృషించేవారు. దానికి పూర్తి భిన్నంగా సగటు ప్రేక్షకులే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడే సినిమా ను మార్చొద్దని కోరడం ఇరుముడి చిత్ర వైభవం. సినిమా తీసివేయొద్దని కొంత మంది సోషల్ మీడియా వేదిక గా పోస్టులు పెట్టడం విశేషం. లేటెస్టుగా ఇప్పటికిప్పుడే నాలుగు వారాలకే ott కి ఇవ్వకుండా ఉండాలని ఎనిమిది వారాల పాటు ఆగితే వినాయక చవితి వరకు ఐదారు వారాల లాంగ్ రన్ షేర్స్ వస్తాయిని సినిమా అభిమానులు కోరుతుండడం చిత్ర స్టామినాను తెలియజేస్తుంది.

రవితేజ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకుని లాభాల్లో షేర్ ఉండేలా చేసుకోవడం బడ్జెట్ ప్లానింగ్ కి కూడా వర్కవుట్ అయింది. గతంలో లాభాల్లో భాగస్వామ్యం, కొన్ని ఏరియాల రైట్స్ తీసుకోవడం కొంతమంది పెద్ద హీరోలు చేసినా సినిమా సక్సెస్ రేట్ మారిపోవడం తో గంపగుత్త రెమ్యునరేషన్ వైపే మొగ్గుచూపారు. సినిమా హిట్ అయి డబ్బులొస్తే మరికొంత పంపమని అడిగే హీరోలు కూడా ఉన్న విషయం విదితమే. ఇరుముడి సక్సెస్ విషయంలో సింహభాగం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఒక భాగమైతే టిక్కెట్ ధరలు పెంచకపోవడం లాంగ్ రన్ విజయానికి పెద్ద ఎస్సెట్ అయింది.
ఇరుముడి’ చిత్రానికి రూ.18.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగగా బ్రేక్ ఈవెన్ కోసం రూ.19 కోట్ల షేర్ ను రెండు రోజుల కే బ్రేక్ ఈవెన్ సాధించి ఎనిమిది రోజులు పూర్తయ్యేసరికి 83.04 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.145.8 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం మొత్తానికి ప్రేక్షకులకు పూర్తి పైసా వసూలు చిత్రం కాగా.. మేకర్స్ కి మాత్రం మంచి సందేశాత్మక చిత్రం.

Related posts

స్వర్ణయుగం తిరిగొచ్చిందా..?

విశాఖ పర్యాటకానికి సరికొత్త త్రిశూల్ శోభ

అధికార, ప్రతిపక్షాలతో కమ్యూనిస్టుల దోస్తానా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More